ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఈ మాలతో తప్పనిసరిగా పూజించాలి.. ఎందుకంటే?

మార్గశిర మాసం ఆ విష్ణు భగవానునికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పవచ్చు.

ఈ మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశని,మోక్షదైకాదశి అని కూడా పిలుస్తారు.ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తెరవటం వల్ల భక్తులందరూ ఆ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అందువల్ల ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.

పూర్వం వైఖానసుడు అనే రాక్షసుడికి నరకం ప్రాప్తించడం వల్ల తన తండ్రిని నరక లోకం నుంచి మోక్షం కలిగించడానికి ఏకాదశి రోజున ఉపవాసంతో వ్రతం ఆచరిస్తారు.దీని ఫలితంగా ఆ రాక్షసుడు తండ్రికి నరకం నుంచి మోక్షం పొంది స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

అందువల్ల ఏకాదశిని మోక్షదైకాదశి అని పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

Advertisement
Lord Vishnu Must Be Worshiped With This Garland On Mukkoti Ekadashi, Lord Vishnu

అంతేకాకుండా స్వామివారి ఉత్తర ద్వారాన్ని కూడా తెరచి ఆ ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

Lord Vishnu Must Be Worshiped With This Garland On Mukkoti Ekadashi, Lord Vishnu

ఈ ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరుగుతుంది.ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం స్నానం ఆచరించి ఆ నారాయణుడి ఎంతో ప్రీతికరమైన తులసి దళాల మాలలతో తప్పకుండా పూజ చేయటం వల్ల ఆ హరి అనుగ్రహం కలుగుతుంది.ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచిక కాబట్టి, ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించాలని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.

అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పగలంతా ఉపవాస దీక్షలో ఉండి, కేవలం తులసి తీర్థం తీసుకుంటూ ఆ శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు