కరోనా సెకండ్ వేవ్ ప్రజలకు ప్రాణాంతకంగా మారి ఎందరి ఊపిరో తీస్తున్న ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.కోవిడ్ నివారించడానికి వ్యాక్సిన్ వచ్చినా దీని వ్యాప్తి మాత్రం ఆగలేదు.
ఇక విధిలేక ఆన్ని రాష్ట్రాలు లాక్డౌన్ వైపు అడుగులు వేశాయి.
ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు చేయబట్టి నెలరోజులు దాటిపోయింది.
మరి కొన్ని రాష్ట్రాల్లో పది నుండి పదిహేను రోజులు దాటగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో మళ్లీ తిరిగి లాక్డౌన్ పొడిగిస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాలు ఈ చర్యలను అమలు చేస్తున్నారు.
అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా మరోసారి లాక్డౌన్ను పొడిగించింది.కాగా ప్రస్తుత లాక్డౌన్ గడువు ఈనెల 24 తో ముగిసిపోతుండగా తిరిగి జూన్ 7వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.
ఇక యధావిధిగా ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రం ప్రజలకు బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.