ఈటెల విషయంలో క్లారిటీగా కేసీఆర్...అసలు వ్యూహం ఇదే?

తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడని చెప్పి ఈటెల పై వేటు వేసిన కేసీఆర్ ను ఇప్పుడు తన వ్యూహ ప్రతి వ్యూహాలతో ఇబ్బంది పెడుతున్నాడని చెప్పవచ్చు.

రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ఈటెలను రాజకీయంగా ఇబ్బంది పెడతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే బీజేపీలో ఈటెల చేరడంతో హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ నియోజకవర్గంగా ఒక్కసారిగా మారిపోయింది.అయితే తెరాసకు ఇప్పటి వరకు కంచుకోటగా భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈటెల రూపంలో కంచుకోటకు బీటలు వారడంతో అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ వెంట ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది.

ఇది టీఆర్ఎస్ కు మరింత పెద్ద దెబ్బ అనేది చెప్పక తప్పదు.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని రకాల వ్యూహ, ప్రతి వ్యూహాల మీద ఈటెలకు మంచి అవగాహన ఉంది కాబట్టి , టీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు వెనుక ఉన్న తాత్పర్యం ను ఈటెల కానీ బీజేపీ ముఖ్య నాయకులు కానీ ఊహించే అవకాశం ఉంది.

ఇదే ఇప్పుడు బీజేపీకి మంచి లాభించే అంశం.ప్రస్తుతం ఈటెల స లహాలను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఉపయోగించుకుంటే టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీగా మారే అవకాశం ఉంది.

Advertisement

ఈటెలపై కెసీఆర్ క్లారిటీగా ఉండడంతో ఇప్పటివరకు మాట్లాడిన తీరుకు భిన్నంగా బీజేపీపై కెసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు