మైనార్టీ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనార్టీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులకు ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ( Outsourcing, guest faculty ) పద్ధతిలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ 8 పోస్టులకు 1:6 చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించారు.

జిల్లాలోని ఆయా మైనార్టీ విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ (జే ఎల్) పోస్టులకు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు.

ఒక్కో పోస్టుకు మెరిట్ ప్రకారం ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు.ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) అధ్యక్షతన ఆర్ ఎల్ సీ రాజేందర్, డిస్ట్రిక్ట్ ఇంచార్జీ మైనార్టీ ఆఫీసర్ రాధాభాయ్, ఓఎస్ డీ సర్వర్ మియా, ప్రిన్సిపాళ్లు లక్ష్మీనారాయణ, ఫాతిమా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.

మొత్తం 48 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు.

ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన పసుల కృష్ణ
Advertisement

Latest Rajanna Sircilla News