శభాష్ పల్లి నూతన గ్రామపంచాయతీ ప్రారంభోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: శభాష్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామపంచాయతీ భవనాన్ని వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు.

గ్రామ అభివృద్ధికి ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పండుగ ప్రదీప్, జెడ్పిటిసి మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News