తెలంగాణ వ‌చ్చాక విద్యారంగంలో భారీ మార్పులుః మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

హైద‌రాబాద్ లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో పోటీ ప‌రీక్ష‌ల స్ట‌డీ మెటీరియ‌ల్ ను మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డిలు విడుద‌ల చేశారు.

నీళ్లు, నిధులు, నియామ‌కాలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఏర్ప‌డిన రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల‌లో ఎంతో అభివృద్ధి చేసుకున్నామ‌ని తెలిపారు.రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

అదేవిధంగా గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.ల‌క్ష‌కు పైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాని అధికారుల‌కు సూచించారు.

ఈ ఎనిమిది సంవ‌త్స‌రాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని ఆయ‌న‌ విమర్శించారు.

Advertisement
నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు