ఆగ్రా హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..!!

దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ రోడ్డు ప్రమాదాలను అరి కట్టలేని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా కాన్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.సరిగ్గా ఈ దుర్ఘటన ఎత్మాఉద్ధౌల్ ప్రాంతంలో జరిగింది.

జార్కండ్ రాష్ట్రానికి చెందిన స్కార్పియో ఒక కంటెైనర్‌ను అతివేగంతో ఢీకొంది.దీంతో అక్కడికక్కడే 8మంది మృతి చెందారు.

నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకుని .స్థానికుల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు.చెల్లాచెదురుగా పడిపోయిన శవాలను పక్కనపెట్టి తీవ్ర గాయాలు అయిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

జరిగిన ఘటనలో మృతుల వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు.ఇదిలా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అయిన క్షతగాత్రుల పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు.

సమాచారం. .

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు