పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ప్రతి పండుగకు ఇదే పరిస్థితి

యాదాద్రి భువనగిరి జిల్లా:హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవే( Hyderabad-Vijayawada National Highway )పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం భారీగా వాహనాలు నిలిపోయాయి.

దసరా పండుగ నేపథ్యంలో హైదారాబాద్ నుండి గ్రామాలకు వెళ్ళే వాహనాలతో 65వ, జాతీయ రహదారి రద్దీగా మారింది.

దీనితో హైదారాబాద్ లోని బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి.ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపినా ప్రయాణికులు వాహనాల వద్ద కిక్కిరిసిపోయారు.

ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.చాలా మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు,ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

ప్రతీ ఏడాది పండుగలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని ప్రయాణికులు వాపోయారు.

Advertisement
పీ హెచ్ సీ ల్లో బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేస్తాం : సందీప్ కుమార్ ఝా

Latest Telugu Top Posts News