దారుణం.. లోకో పైలట్ దారుణ హత్య చేసిన దుండగుడు(వీడియో)

తాజాగా విజయవాడ ( Vijayawada )నగరంలోని రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య జరిగింది.డ్యూటీలో ఉన్న ఓ రైలు డ్రైవర్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేసి హతమార్చాడు ఓ అంగంతకుడు.

 Atrocious.. The Thug Who Brutally Murdered The Loco Pilot (video), Social Media,-TeluguStop.com

పోలీసుల కథనం ప్రకారం.షంటింగ్‌ లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఎబినేజర్‌ (52) గురువారం ఉదయం స్టేషన్ లోని నైజాంగేటు సమీపంలో ఉన్న ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి క్యాబిన్‌ F కు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఇనుప రాడ్‌తో అతనిపై దారుణంగా దాడి చేశాడు.


రాడ్ తో అనేక దెబ్బలు తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడి రైలు పట్టాలపై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అదే సమయంలో అటుగా వెళ్తున్న మరో రైలు డ్రైవర్‌ వృద్ధ్వీరాజ్‌ అక్కడ జరుగుతున్న దానిని గమనించి దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు.అక్కడే పడి ఉన్న ఎబినేజర్, బాటసారులు రైల్వే ఆసుపత్రికి అతనిని తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఘటనపై విజయవాడ జీఆర్పీ పోలీసులు ( GRP Police)కేసు నమోదు చేశారు.నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.టీవీ ఛానెల్‌ లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను అధికారులు గుర్తించారు.నైజాంగేటు సెంటర్‌లో అదే వ్యక్తి ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గంజాయి మత్తులో ఈ దాడులు చేసి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube