పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

యాదాద్రి జిల్లా:భువనగిరి పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు సీజ్ చేసిన వాహనాల పార్కింగ్ లో అగ్నిప్రమాదం జరిగి పదుల సంఖ్యలో వాహనాలు మంటలకు ఆహుతి అయ్యాయి.

వివరాల్లోకి వెళితే ఆదివారం పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న వెహికల్ పార్కింగ్ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగి పలు కేసులలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలలోని బైక్ లు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను ఆర్పివేశారు.

అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చామలను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
Advertisement

Latest Rajanna Sircilla News