మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణం, తరగతి గదులు, సరుకులు నిలువ చేసే గది, కిచెన్, స్టోర్ రూం, తదితర వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా అని  అడిగి తెలుసుకున్నారు.భోజన సదుపాయం, తరగతులు ఎలా బోధిస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.

అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా పాఠాలు బోధించాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్, ప్రిన్సిపాల్ ఆర్ ఎస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన పసుల కృష్ణ
Advertisement

Latest Rajanna Sircilla News