మునుగోడు అసెంబ్లీ ఓపెన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది.
టిఆర్ఎస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తితోంది.దీంతో ప్రాజెక్టులోని 14 గేట్లను కొంతమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ కు అనుమతించనున్నారు.
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో పోలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు పొడిచారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సి గౌడ్ ఈనెల 19 ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సంచారం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి ప్రాజెక్టు ( నింజ్) ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు జారీ చేసింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది.
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.దుర్గగుడి దసరా ఆదాయం 16 కోట్లు వచ్చినట్లుగా ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఈనెల 19వ తేదీన పల్నాడు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడ నుంచి ఏలూరు, గుంటూరు జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోత్తం గా నిర్వహించనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటయింది.ఐదుగురు సభ్యులతో ఆగమహా సలహా మండలని ఏర్పాటు చేస్తూ టిటీడీ ఉత్తర్వుల జారీ చేసింది.
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు ఆళ్లగడ్డ లో పర్యటిస్తున్నారు.
ఏపీ గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు ముగిశాయి.
ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మారుస్తూ , చెడ్డ పేరు తెస్తున్న బీసీ ప్రసాద్ రెడ్డి ని వెంటనే బర్త రఫ్ చేయాలని టిడిపి అధికార ప్రతినిధి కావలి గ్రేష్మ డిమాండ్ చేశారు.
కమ్మ సామాజిక వర్గంపై రాజకీయ పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని అఖిలభారత కమ్మ సామాజిక వర్గం వేదిక హెచ్చరించింది.
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి మార్కుల జాబితాను అప్డేట్ చేసుకోవచ్చు అని ఆర్జీయూకేటీ ప్రకటించింది.
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy