భార్యని చంపి ఆమెతో రాత్రంతా...

ప్రస్తుత కాలంలో కొందరు మద్యం మత్తులో మునిగిపోయి సోయి లేకుండా తమ అనుకున్న వారి జీవితాల్లో  తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.

తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను చంపి ఆమెతో రాత్రంతా గడిపి ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఎల్లప్ప అనే వ్యక్తి తన భార్యతో కలిసి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నాడు.పేరు లోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు.

అయితే పెళ్లయినప్పటి నుంచి వీళ్ళ మధ్యలో సరైన సఖ్యత లేకపోవడం వల్ల తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఎల్లప్ప పలుమార్లు తన భార్యతో విడాకులు కావాలంటూ పెద్ద గొడవ చేసేవాడు .అయితే ఈ విషయం తన భార్య అమృత ఆమె తల్లిదండ్రులకు తెలపగా ఎల్లప్పని పంచాయతీకి పిలిచి సర్ది చెప్పి కాపురానికి పంపించారు.

అయితే తాజాగా ఎల్లప్ప తన ఇంట్లో మద్యం సేవిస్తుండగా తనకు మరియు తన భార్యకు మధ్యలో చిన్నపాటి గొడవ జరిగింది.అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి ఉన్నటువంటి ఎల్లప్ప ఈ గొడవలో తన భార్యని గొంతు నులిమి చంపేశాడు. అంతేగాక పక్కనే ఉన్నటువంటి సిలిండర్ తీసుకుని తలపై బలంగా మోదాడు.

Advertisement

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.అయితే  ఫుల్లుగా మద్యం మత్తులో ఉండడంతో ఈ విషయాన్ని గమనించక లేకపోయాడు.

దీంతో రాత్రి మొత్తం ఆమె ప్రక్కనే ఏమీ ఎరగనట్లు నిద్రపోయాడు.అయితే తెల్లవారుజామున మెలుకువ రావడంతో విషయాన్ని గ్రహించిన అటువంటి ఎల్లప్ప స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన సంగతి చెప్పి లొంగిపోయాడు.

విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.అలాగే నిందుతుడు ఎల్లప్ప చెప్పిన వివరాలు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు