నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రారంభించిన ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం జగన్( CM Jagan ) పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.2024 తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పడేది జనసేన - టీడీపీ ప్రభుత్వమే అని ప్రకటించారు.జగన్ ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని అంటున్నారు.
అయితే ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం మీరు కౌరవులు.వందకి పైగా వైసీపీ( YCP ) వాళ్లు సభ్యులుగా ఉన్నారు.
కాబట్టి వైసీపీ వాళ్ళు కౌరవులే.కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే.
కింగ్ జేమ్స్ బైబిల్ లో చెప్పినట్లుగా.దావీదు గొలియాతు యుద్ధంలా భావిద్దాం.
ఈ కథలో ఫిలిష్తీయుల తరుపున గొలియాతు అనే ఒక బలవంతుడు అహంకారంతో విర్రవీగుతుంటాడు.అటువంటి అహంకారంతో విర్రవీగుతున్న గొలియాతుని.14 సంవత్సరాల వయసు కలిగిన గొర్రెల కాపరి అయిన దావీదు ఎదుర్కొంటాడు.ఫిలిస్తీయుల దగ్గర కత్తులు కటార్లు ఆయుధాలు ఉంటే.
దావీదు చిన్న ఉండిలాతో.ఆ ఫిలిష్తీయుల ఆర్మీ తరపున వచ్చిన గొలియాతుని ఒక్క దెబ్బతో చంపేస్తాడు.
సో జగన్ కి చెబుతున్న మీరు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం.లేదు "దావీదు- గొలియాతు" యుద్ధమంటే అది.ఛాయిస్ మీకే ఇస్తున్న.మీరు అధికారంలో నుండి దిగటం.
మేము అధికారంలోకి రావడం గ్యారెంటీ అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే అవనిగడ్డలో పవన్ వారాహి యాత్రపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో సెటైర్లు వేశారు."1+1=2 గణితంలో.కొన్నిసార్లు రాజకీయాలలో 1+1=0 అవుతుందని ప్లాప్ అయినా అవనిగడ్డ "వరాహగళం" నిరూపించింది" అని పోస్ట్ పెట్టారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy