ముఖ్యంగా చెప్పాలంటే మన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాముఖ్య ఆధ్యాత్మిక సన్నిధానం వీరపాలెంలో కొలువు తీరిన శివ పంచాయతన క్షేత్రం( Shiv Panchayat Kshetra m ).తాడిపల్లి గూడెం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులు అనంతపల్లి వెళ్లే మార్గంలో చిరుతాడేపల్లి కడియం యొద్ద నీలాద్రిపురం మీదుగా చేరుకోవచ్చు.
ప్రకృతి రమణీయత మధ్య చక్కటి పల్లె వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండే ఈ దేవాలయ సముదాయాన్ని బాలత్రిపుర సుందరి పీఠం( Balatripura Sundari Peetham ) ఆధ్వర్యంలో 2003 సంవత్సరంలో కేవలం 99 రోజుల వ్యవధిలోనే నిర్మించారు.
హిందూ దేవాలయ విధానంలో పంచాయతనానికి విశిష్ట స్థానం ఉంది.
ఐదుగురు దేవతామూర్తులకు ఒకే ప్రాములలో ప్రత్యేక పూజలు చేసే విధానాన్ని పంచాయితీలు అని అంటారు.ఈ క్షేత్రంలోని గర్భాలయంలో విశ్లేషణుడు రుద్రాక్ష మండపంలో బాల లింగ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు.
ఇక్కడ శివలింగాన్ని పవిత్ర నర్మదా నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతిష్టించారు.మేధా సరస్వతి దేవాలయం రెండవ బాసరగా ప్రసిద్ధి చెందింది.
నిలువెత్తు సరస్వతి అమ్మవారి రూపం చూస్తూ భక్తులు అమ్మవారి సన్నిధిలో నిత్యం చిన్నపిల్లలకు సామూహికంగా అక్షరభ్యాసం నిర్వహిస్తారు.
ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, బాలా త్రిపుర సుందరీ దేవి, సాయిబాబా మందిరాలు కూడా ఉన్నాయి.సుశీలమైన దేవాలయ సముదాయంలో అపురూప శిల్పాకృతిలో నలుదిక్కుల నిలువెత్తు భారీ విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.సరస్వతి దేవి దేవాలయానికి అభిముఖంగా భారీ శివపార్వతుల విగ్రహం, వారికి ఎదురుగా 42 అడుగుల అష్టముఖ గణపతి విగ్రహం చూసే కొద్ది చూడాలనిపించేలా ఉంటాయి.
ఈ పుణ్యక్షేత్రంలో అరుదైన శివలింగాలను చూడవచ్చు.ఈ ఆవరణలోనే దశావతారాలు వివిధ రూపాల్లో కొలువైన అమ్మవారి విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు.ఈ పంచాయితీల క్షేత్రానికి మహాశివరాత్రి, కార్తీక మాసం, దేవీ నవరాత్రులు వంటి ముఖ్యమైన రోజులలో పాటు నిత్యం అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.ఇక్కడ శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తారు.
ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.నిత్యం ఇక్కడ భక్తులకు ఉచిత అన్నదనాన్ని నిర్వహిస్తారు.
ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హుండీలో దక్షిణలు తీసుకోవడం, విరాళాలు స్వీకరించడం p అనేది ఉండదు.
DEVOTIONAL