కారు గ్యారేజీకి పోతోందని ట్విట్టర్ టిల్లు నారాజ్.. బండి సంజయ్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

కారు గ్యారేజీకి పోతోందని ట్విట్టర్ టిల్లు నారాజ్ అవుతున్నారని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లాలో చెల్లి ఓటమి ఖాయమైందని ఆగమవుతున్నారని బండి సంజయ్ తెలిపారు.వరంగల్ డల్లాస్ కాలేదు, కనీసం బస్టాండ్ కూడా రాలేదన్నారు.

నిజామాబాద్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని పేర్కొన్నారు.ఆదిలాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ లు రాలేదన్నారు.కరీంనగర్ లండన్ కాలేదు, వేములవాడకు ఏటా రూ.100 కోట్లు లేవన్న బండి సంజయ్ లక్ష ఉద్యోగాలు రాలేదు, రూ.3 వేల భృతి ఇవ్వలేదని విమర్శించారు.రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, పోడు పంచాయతీ పోలేదని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్లలో కల్వకుంట్ల ఖజానా నిండింది తప్ప ఒరిగిందేమీ లేదని చెప్పారు.అయితే దొంగ హామీలు, దగా మాటలకు కాలం చెల్లిందన్నారు.

Advertisement

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు