శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయంలో కన్నుల పండువగా 13 వ వార్షికోత్సవ వేడుకలు

వెయ్యి మంది కి అన్న ప్రసాదం నవగ్రహాపూజ , అభిషేకం, హోమం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో 13 వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా మంగళవారం జరిగాయి.

ఆలయ పూజారి గోంగళ్ళ ఉమాశంకర్ శ్రీ ఆంజనేయస్వామి శివ పంచాయతనం కు అభిషేకం, నవ గ్రహాపూజ ప్రత్యేకపూజలు హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి పులిహోర తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.దాతల సహాయం తో సుమారు వెయ్యి మంది కి అన్నప్రసాదం చేశారు.

ఈ సందర్భంగా స్వామి వారి ని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఓలాద్రి సత్యం రెడ్డి,రైతు సంఘం మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, రాజు , బిజెపి నాయకులు పారిపెల్లి సంజీవ్ రెడ్డి, పారిపెల్లి రామ్ రెడ్డి సందుపట్ల రాంరెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి శ్రీ ఆంజనేయస్వామి దర్శించుకున్నారు.ఈ వార్షికోత్సవం వేడుకలను బొందుగుల మార్కేండేయా , నగుబోతు లక్ష్మీ నారాయణ ,రాము ,మెగి నర్సయ్య, వడ్నాల లక్ష్మన్ , డాక్టర్ దేవేందర్, గాజుల దాస్ , గాండ్ల ఆంజనేయులు, గాండ్ల ఆంజనేయులు , దోమల భాస్కర్ , సుంకి భాస్కర్, అవుసుల పురుషోత్తం, యమగొండ కృష్ణారెడ్డి, సిద్ది రాములు , నూకల శ్రీ నివాస్, లు నిర్వహించారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

Latest Rajanna Sircilla News