కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పందిర్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, సుడిద రాజేందర్,మర్రి శ్రీనివాస్ రెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, బండారి బాల్ రెడ్డి, చేపూరి రాజేశం, గంట కార్తీక్ గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, బుచ్చ గౌడ్, మిర్యాల్కర్ చందు, గుర్రపు రాములు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల సహకారంతో స్టాఫర్ల ఏర్పాటు

Latest Rajanna Sircilla News