కాంగ్రెస్ పార్టీ చేసిన వెకిలి చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నాం

రాజన్న సిరిసిల్ల జిల్లా:భారత దేశ ఉపరాష్ట్రపతి లోకసభ ఛైర్మన్ జగదేవ్ ధనాకర్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యంగమేనైనా అమర్యాద పూర్వకమైన మాటలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట పక్షన తీవ్రంగా కండిస్తున్నామని అధ్యక్షులు తిరుపతిరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నిజం గా రాజకీయ విలువలను తుంగలో తొక్కుతూ భారత రాజ్యాంగ విలువల కు నష్టం చేకూర్చే విధంగా నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశం తరువాత రాహుల్ గాంధీ తో పాటు అక్కడున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ లు ఉపరాష్ట్రపతి ఫై కనీసం విలువ,బాధ్యత సంస్కారం లేకుండా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లపై మిమిక్రి పేరిట కించపరిచే విధంగా చేస్తూ అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా భారత దేశ ప్రతిష్టతలను ఆగౌరపరిచె విధంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేశం తల దించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నారు.

భారత రాష్ట్రపతి అనే కనీసం గౌరవం లేకుండా వెకిలి చేష్టలతో ప్రవర్తించడం దేశ ప్రజలు గమనిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వీడియోస్ తీయడం మరింత సిగ్గుచేటు అని అన్నారు.

ఇలాంటి వాళ్ళ వల్ల దేశ సంస్కృతి సంప్రదాయాలు పై నష్టం వాటిల్లుతుందని రానున్న రోజుల్లో దేశ ప్రజలు మరింత బుద్ది చెప్తారని వీళ్ళు చేసిన వెకిలి చేష్టలు కు గాను రాహుల్ గాంధీ సత్వరమే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నామన్నారు .

పేద ప్రజల సంక్షేమం కోసం సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది
Advertisement

Latest Rajanna Sircilla News