బాలయ్యతో ''ఆది'' సినిమా తియ్యాలనుకున్నడట.. కానీ ఆ కారణం వల్ల?

ఆది సినిమా.ఈ సినిమా తెలియని తెలుగు మాస్ ఆడియెన్స్ ఉండరు.

ఆ సినిమా వచ్చే వరకు ఫ్యాక్షనిజం ఒక ఎత్తు అయితే ఆ సినిమా వచ్చిన తర్వాత వచ్చే ఫ్యాక్షనిజం మరో ఎత్తు.ఆ సినిమా చూడటానికి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా అద్భుతంగా నిలిచింది.నిజానికి ఎన్టీఆర్ ను మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసిన సినిమా కూడా ఇదే .ఇక అలాంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు వివి వినాయక్.నిజానికి ఆది సినిమా తీసిన సమయంలో అయన ఏ సినిమా తీయలేదు.మొదటి చిత్రం అదే.మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు.ఇక ఆతర్వాత ఫ్యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు వివి వినాయక్.

బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమా తియ్యగా ఆ సినిమాలో ఏ రేంజ్ ఫ్యాక్షనిజం ఉందొ చెప్పాల్సిన పని లేదు.ఒకేసారి నాలుగు సుమోలు గాల్లోకి ఎగరడం అబ్బో చెన్నకేశవ రెడ్డి సినిమా మాములుగా ఉందా? ఇక అలాంటి వివి వినాయక్ తన కెరీర్ లో ఎన్నో సినీమాలు అద్భుతంగా తీశాడు.మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన వివి వినాయక్.

Advertisement

తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా అనే షోకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

అవి ఏంటంటే? వివి వినాయక్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఆది.ఆ సినిమాకు మొదట బాలకృష్ణను హీరోగా అనుకుంటే దానికి ఎన్టీఆర్ ఓకే అన్నాడని ఆ సమయంలో ఎన్టీఆర్ కోసమే చిన్నపిల్లాడు బాంబు విసిరే సన్నివేశం చిత్రీకరించినట్టు చెప్పుకొచ్చాడు.ఇక ఆది చిత్రం హిట్ అవ్వగానే బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమా తియ్యగా ఆ సినిమాలో బాలయ్య బాబు ఎంతో అందంగా ఉన్నారని.

బాలయ్య బాబు బాగా చూపించారని.బాలయ్య బాబు సతీమణి వసుంధరగారు ఆయన్ని మెచ్చుకున్నట్టు వివి వినాయక్ చెప్పుకొచ్చాడు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు