అధ్యక్ష బరిలో నేనూ ఉన్నా...గాంధీజీ నాకు స్పూర్తి..!!

అగ్ర రాజ్యం అమెరికాలో సైతం రాజకీయాలు జోరుగానే ఉన్నాయి.ఎంతో మంది వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష ఫీటం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ పోటీలో ఇప్పటికే భారత సంతతి హిందూ మహిళ అయిన

తుల్సీ గబ్బర్ పోటీ పడుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించగా.ఈ కోవలోనే మరో భారత సంతతి మహిళ కమలా హారీస్ సైతం పోటీలో ఉన్నానని ట్వీట్ చేశారు.దాంతో ఇప్పుడు అమెరికాలో ఇద్దరు భారతీయ మహిళలు అధ్యక్ష పోటీలో నిలుస్తున్నారు.

ఇదిలాఉంటే కమల తానూ మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందానని , మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ జయంతిని అమెరికన్లు అందరూ జరుపుకుంటున్న సమయంలో నేను సైతం పోటీ చేస్తున్నాని ప్రకటించడం గర్వంగా ఉందని ఆమె అన్నారు.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి సెనేటర్ గా అమెరి రికార్డ్ క్రియేట్ చేశారు.అయితే ఇప్పుడు ఇద్దరు భారత సంతతి మహిళలు సైతం పోటీ పడటం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి అంటున్నారు.ఇప్పటి వరకూ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం పోటీ పడుతున్న వారిలో హ్యారిస్ నాలుగో వ్యక్తి కావడం గమనార్హం.

Advertisement
భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు
Advertisement

తాజా వార్తలు