ఇప్పటి వరకు యాడ్స్ లో నటించని నటీనటులు ఎవరో తెలుసా?

సినిమా తారలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడంలో ముందుంటారు.కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు.

సినిమాలు చేస్తూనే పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.పలు బ్రాండ్ లను ప్రయోట్ చేస్తుంటారు.

చాలా మంది సినిమా తారలు ఇదే బాటలో పయణిస్తున్నారు.సినిమా నటీనటులతో తమ ఉత్పత్తులను లాంచ్ చేయించడం మూలంగా వాటి విలువ పెరుగుతుందని వ్యాపారవేత్తల నమ్మకం.

అయితే కొందరు నటీనటులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయలేదు.వాటికి దూరంగా ఉంటున్నారు.

Advertisement

ఇందకీ ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

*సాయి పల్లవి

సినిమా రంగంలోకి అడుగు పెట్టి.

అతి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు పొందింది సాయి పల్లవి.ఎన్నో బ్రాండ్లు తమ అంబాసిడర్ గా ఉండాలని ఆఫర్ ఇచ్చినా తను తిరస్కరించింది.

తన టీనేజీలో ఒక యాడ్ లో నటించింది.సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.

*మంచు మనోజ్

మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.కానీ ఇంత వరకు ఏ ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.

*నందమూరి బాలకృష్ణ

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

టాలీవుడ్ నట సింహం బాలయ్య కూడా ఇప్పటి వరకు ఏ బ్రాండ్ కు అంబాసిడర్ గా చేయలేదు.నటించను అని చెప్పాడు.అయితే సామాజికి బాధ్యత కోసం తీసే యాడ్స్ లో నటిస్తానని ఆయన గతంలోనే వెల్లడించాడు.

*గౌతమి

Advertisement

తెలుగు, తమిళ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన గౌతమి సైతం ఇప్పటి వరకు ఏ యాడ్ చేయలేదు.

*మోహన్ బాబు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు సైతం ఇప్పటి వరకు ఏ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదు.

*నందమూరి కళ్యాణ్ రామ్

ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటి వరకు ఏ యాడ్ లో నటించలేదు.

*మంచు విష్ణు

గత దశాబ్దం నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నా.ఇప్పటి వరకు ఏ ఒక్క యాడ్ లో కూడా నటించలేదు.వీరితో పాటు శర్వానంద్, నాని, అజిత్, రజనీకాంత్, కమల్ హాసన్, అనుష్క శెట్టి సైతం యాడ్స్ లో నటించలేదు.

తాజా వార్తలు