తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

 

సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు వైభవంగా జరిగాయి.

మల్టీ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. 

2.ఒమన్ లో మహానాడు సంబరాలు

  రోమన్ రాజధాని మస్కట్ లో ఎన్నారై టిడిపి ఒమన్ విభాగం ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తదితరులు హాజరయ్యారు. 

3.న్యూ జెర్సీ లో బాలసుబ్రమణ్యం  జయంతి

 

దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యం 75 వ జయంతి ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిషన్ నగరంలో నిర్వహించారు. 

4.ఆలయ నిర్మాణానికి ఎన్ఆర్ఐ కోటి రూపాయలు విరాళం

  ఒడిశాకు చెందిన భాస్కర్ చంద్ర నాయక్ అనే వ్యక్తి గత 43 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వైద్యుడిగా పని చేస్తున్నారు.ఇండియాలోని ఒడిస్సా రాష్ట్రం జైపూర్ జిల్లాలోని బెరుడా పంచాయతీ పరిధిలోని తన స్వగ్రామమైన జగత్ పూర్ లో నిర్మించతలపెట్టిన పూరి జగన్నాథుని ఆలయం కి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

5.మంకీ ఫాక్స్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ సూచనలు

 

ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అనేక సూచనలు చేసింది. 

6.అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న బ్రిటన్ ప్రధాని

 

Advertisement

కోవిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో తన అధికారిక నివాసంలో విందు ఇచ్చిన వ్యవహారంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యుల నుంచి  విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు . 

7.చికాగో లో ఓయూ పౌండేషన్ డే

 

అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14 న ఉస్మానియా యూనివర్సిటీ పౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

8.అమెరికాలో మరో సారి కాల్పులు.9 మంది మృతి

 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.మూడు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. 

9.సిరియాలోని చర్చ్ పై ఉగ్రవాదుల కాల్పులు.50 మంది మృతి

 నైజీరియాలో ఉగ్రవాదుల కాల్పులు జరపడంతో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఒండో  రాష్ట్రం లోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి లో ఈ దారుణం చోటుచేసుకుంది. 

10.ముస్లిం ప్రవక్త పై  అనుచిత వ్యాఖ్యలు.

ఖండించిన సౌదీ అరేబియా

  ముస్లిం మతం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త పై సస్పెండ్ అయిన ఇద్దరు బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సౌదీఅరేబియా తో పాటు గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖతర్ లో పర్యటించనున్న సమయంలో ఈ వివాదం రాజుకుంది .బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్న సౌదీ అరేబియా.మతాలు విశ్వాసాలను గౌరవించండి అని పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు