మర్యాద కృష్ణయ్య తో మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న వెటరన్ హీరోయిన్....

తెలుగులో 2010వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "మర్యాద రామన్న" చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించి తమ ఎన్నోసెంట్ నటనతో కట్టిపడేసిన టాలీవుడ్ ప్రముఖ హీరో మరియు కమెడియన్ సునీల్ మరియు వెటరన్ హీరోయిన్ సలోని అశ్విని ల గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దర్శక నిర్మాతలకు కాసుల పంట పండించింది.

అయితే ఈ చిత్రంలో నటించిన తర్వాత అటు సునీల్ కి ఇటు సలోని అశ్విని కి సరైన హిట్ లేక కెరియర్ చాలా చప్పగా సాగుతోంది.దీంతో వీరిద్దరూ మరోమారు జంటగా నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు.

కాగా మర్యాద కృష్ణయ్య అనే చిత్రంలో వీరిద్దరూ మరోమారు జంటగా నటిస్తున్నారు.దీంతో తాజాగా సలోని అశ్విని మరియు సునీల్ కలిసి సినిమా షూటింగ్ సెట్లో మాస్టర్ చిత్రంలోని "వాతి కమింగ్" అనే పాటకి డాన్స్ చేసిన వీడియో ని తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

అంతేకాకుండా ఈ వీడియోకి "మేం మళ్ళీ వచ్చేసాం" అని సలోని అశ్విని క్యాప్షన్ కూడా పెట్టింది.అయితే ఈ చిత్రం పల్లెటూరులో మర్యాదలు ఎలా ఉంటాయి మరియు అతి మర్యాదను పాటించి ఓ వ్యక్తి ఎలా చిక్కుల్లో ఇరుక్కున్నాడు, అలాగే సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Advertisement

దీంతో మర్యాద రామన్న తరహాలోనే మరోమారు సునీల్ హిట్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు వి.

ఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాతలు కిషోర్ గరికపాటి మరియు టి.జి విశ్వ ప్రసాద్ తదితరులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి నూతన సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతం స్వరాలను సమకూరుస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు