మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు రేవంత్ రెడ్డి రిప్లై

తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

లీగల్ నోటీసును కేటీఆర్ వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఉద్యోగాల కేంద్రంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు.తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్ కు సంబంధం లేదని చెప్పారు.

టీఎస్పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందన్న రేవంత్ రెడ్డి అలాంటప్పుడు తనకు సంబంధం లేదని కేటీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు.నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు