రామ్ చరణ్ కోసం మహేష్ హీరోయిన్... మీకు అర్థమవుతోందా.... 

టాలీవుడ్లోకి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఛలో అనే చిన్నపాటి బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత తనకు వచ్చినటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

 అంతేకాక ఇటీవలే తాను నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి.

దీంతో ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో కొనసాగుతోంది.అయితే ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న "ఆచార్య" అనే చిత్రంలో ఈ అమ్మడు నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో రష్మిక ను మెగాస్టార్ సరసన కాకుండా ఈ చిత్రంలో చిరంజీవి బ్లాక్ ఫ్లాష్ బ్యాక్ లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసమని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు పూర్తి అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ సందిగ్దత నెలకొంది.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ ఫిజిక్స్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం కరుణ వైరస్ దేశంలో ప్రబలుతుండడంతో కొంతకాలం పాటు ఈ చిత్రం షూటింగ్ పనులను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు