‘రంగ్ దే’ చిత్రం అక్కడి నుండి ఎత్తేశారా?

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నితిన్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.దర్వకుడు వెంకీ అట్లూరితో జతకట్టి ‘రంగ్‌దే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా కూడా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా ఓ మలయాళ సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది.దుల్కర్ సాల్మన్ హీరోగా నటించిన చార్లీ అనే సినిమాలో హీరో స్వేచ్ఛగా జీవించే వ్యక్తిగా నటించాడు.

Advertisement

హీరోయిన్ కూడా అదే రీతిలో జీవించడం ఇష్టపడుతుంది.వీరిద్దరు ఎలా కలిసారు, ఆ అమ్మాయి కోసం హీరో ఏం చేశాడనే అంశంపై చిత్ర కథ ఉంటుంది.

ఇప్పుడు రంగ్ దే కథ కూడా ఇదే తరహా కథ అని తెలుస్తోంది.దీంతో నితిన్ ఈసారి మలయాళం నుండి సినిమాను ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాను నిజంగానే మలయాళం నుండి ఎత్తేశారా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు