పవన్ కోసం మళ్లీ సెట్టింగ్స్ వేయిస్తున్న క్రిష్‌.. ఈసారైనా పూర్తి అయ్యేనా?

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా హరి హర వీరమల్లు.

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ కరోనా కారణంగా సినిమా ఇప్పటి వరకు పూర్తి కాలేదు.పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా ఈ సినిమా కోసం డేట్ లను కేటాయించలేక పోతున్నాడు.

ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ని జరపాలని భావించగా నిర్మాతల యొక్క బంద్ కారణంగా సినిమా షూటింగు ప్రారంభం కాలేదు.ఎట్టకేలకు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి సినిమాల యొక్క షూటింగ్ లను పునః ప్రారంభించుకోవచ్చు అంటూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు.

దాంతో దర్శకుడు క్రిష్ సెప్టెంబర్ మొదటి వారం లో హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ ని పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 20 రోజుల పాటు ఈ సినిమా కోసం డేట్ లను కేటాయించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది.

Advertisement

ఆ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.మరో వారం రోజుల పాటు ప్యాచ్ వర్క్ ఉంటుంది.

దాంతో మొత్తం సినిమా పూర్తి అవుతుందని సమాచారం అందుతుంది.పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్టులను దర్శకుడు క్రిష్‌ వేయిస్తున్నాడు.

రామోజీ ఫిలిం సిటీ తో పాటు రామానాయుడు స్టూడియో లో భారీ ఎత్తున సెట్టింగ్‌ లను వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అవుట్ డోర్‌ షూటింగ్ అంటే పవన్ కళ్యాణ్ తో సమస్య ఏర్పడుతుంది.

అందుకే సాధ్యమైనంత వరకు సెట్స్ లోనే సినిమాలను పూర్తి చేసేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే కాస్త ఎక్కువ బడ్జెట్ అయిన భారీ ఎత్తున సెట్టింగ్‌ లను నిర్మిస్తున్నామంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నానంటూ దర్శకుడు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు