విద్యుత్ షాక్ తో ఆపరేటర్‌ మృతి

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్(40) గురువారం ఉదయం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.

మృతుడు మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

తెల్లబల్లిలో రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు వుందని పిలవడంతో వెళ్ళాడు.సబ్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకొన్నామని రైతులు చెప్పడంతో ట్రాన్ఫర్మర్ ఎక్కి రిపేర్ చేస్తుండగా విద్యుత్ సరపరా జరిగి సుధాకర్ స్పాట్లోనే మరణించాడు.

బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు వున్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News