వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

అదేవిధంగా భూపాలపల్లి జిల్లా మరియు హన్మకొండ జిల్లాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

ఇందులో భాగంగా ముందుగా భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలో పర్యటిస్తారని తెలుస్తోంది.తరువాత హన్మకొండ జిల్లా రంగంపేటకు కిషన్ రెడ్డి చేరుకుని వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

అనంతరం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.వరద బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు.

వాలంటీర్ల విషయంలో సస్పెన్స్ .. వాటిని తొలగించాలంటూ ఆదేశాలు 
Advertisement

తాజా వార్తలు