ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా..: మంత్రి పువ్వాడ

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను అప్ డేట్ వర్షన్ లాంటి వాడినన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాత వర్షన్ మనకెందుకు అని ప్రశ్నించారు.అలాగే డాలర్ మనకు ఎందుకని ఎద్దేవా చేశారు.

మన కూరగాయల మార్కెట్ లో డాలర్ చెల్లుతుందా అని అడిగారు.ఈ క్రమంలో డాలర్ బయటదని, మనకు వద్దని చెప్పారు.

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు.కానీ కొందరు నేతలు అభివృద్ధి అంటూ పౌడర్ వేసుకొని వస్తున్నారని విమర్శించారు.

Advertisement

తుమ్మల నాగేశ్వర రావును గతంలో మంత్రిని చేస్తే అందరినీ ఓడించారని విమర్శించారు.ఈ నేపథ్యంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు