మూడు అంతస్థుల భవనం నెలమట్టం.. బాంబ్ పేలిందని షాక్..!

ఓ హోటల్ భవనాన్నినిర్మిస్తున్నారు.అది మూడో అంతస్తు వరకు నిర్మాణం పూర్తి చేసుకుంది.

నిర్మాణం త్వరలో పూర్తి కాబోంతుందని స్థానికులు అనుకున్నారు.కానీ, అందరికీ ఊహించని ఘటన ఎదురైంది.

మంగళవారం రాత్రి సయమంలో ఒక్క సారిగా అది నేలమట్టమైంది.రాత్రి 10 గంటల సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం.

ఒక్కసారిగా బాంబు పేలిందని అన్నట్లు ఆ శబ్దం ఉంది.చుట్టుపక్కల ప్రజలు అందరూ షాక్ గురయ్యారు.

Advertisement

తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ఏమైంది.ఏమైంది అని ప్రశ్నించుకున్నారు.

అందరిలోనూ అదే టెన్షన్.ఉగ్రవాదులు బాంబు పేల్చినట్లు అంతలా వచ్చింది ఆ శబ్దం.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని మాజెస్టిక్ ఏరియాలో మూడు అంతస్తుల నిర్మాణంలో ఉన్న హోటర్ కుప్పకూలింది.మంగళవారం రాత్రి 10 గంట సమయంలో పెద్ద శబ్దం చేస్తు పటపట విరిగింది.

తిన్నగా కూలడంతో స్థానికులకు ఎవరికీ ప్రాణహాని జరగలేదు.ఈ హోటల్ నిర్మాణం చేపట్టక ముందు ఈ ప్రదేశంలో కపాలీ థియేటర్ ఉండేదని, ఇప్పడు ఆ ప్రదేశంలో ఓ మాల్, మల్లీఫ్లెక్స్ ను నిర్మిస్తున్నారు.2017 నుంచి నిర్మాణం కొనసాగుతూనే ఉంది.హోటల్ నిర్మాణం మూడో అంతస్తు వరకు కావొచ్చింది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

కానీ భవనానికి సోమవారం బీటలు రావడంతో యాజమాన్యం ముందు జాగ్రత్త పడ్డారు.స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

భవనం కూలీనా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.ప్రస్తుతం భవనం కూలీన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు