నా ఆలోచనలు తప్పని అర్థమైంది.. హీరోయిన్ సాయిపల్లవి కీలక వ్యాఖ్యలు?

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు.

అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అందం విషయంలో తనకు భయాలు ఉండేవని సాయిపల్లవి చెబుతున్నారు.

సినిమాల్లో నార్మల్ లుక్ లో కనిపించడానికి సాయిపల్లవి ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.సౌత్ ఇండియాలో అన్ని సినిమాల్లో సాయిపల్లవి ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

తొలి సినిమాలో నటించే సమయంలో అందం గురించి తన ఆలోచనలు ఏ విధంగా ఉండేవో సాయిపల్లవి తాజాగా చెప్పుకొచ్చారు.కాలేజ్ లో చదువుకునే సమయంలోనే తాను సినిమా రంగంలోకి వచ్చానని అయితే మిగతా అమ్మాయిలలా తనకు అందానికి సంబంధించి కొన్ని భయాలు ఉండేవని సాయిపల్లవి కామెంట్లు చేశారు.

తాను సినిమాలలో చూసిన హీరోయిన్లంతా ముఖంపై మచ్చలు లేకుండా ఎంతో అందంగా కనిపించేవారని సాయిపల్లవి పేర్కొన్నారు.అయితే అందంగా ఉండే హీరోయిన్లు ఉండే ఈ ఇండస్ట్రీలో తాను సెట్ అవుతానా? అని అనిపించిందని ప్రేక్షకులు తనను సినిమాలలో చూసి ఈమె ఈ విధంగా ఉందేంటి? అని అనుకుంటారని తనలో తాను మదనపడేదానినని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత క్యారెక్టర్ కంటే పైకి కనిపించే అందంనే ఎక్కువమంది ఇష్టపడతారని తనకు అర్థమైందని సాయిపల్లవి పేర్కొన్నారు.

Advertisement

అయితే మలయాళ ప్రేమమ్ థియేటర్లలో విడుదలైన తర్వాత నా ఆలోచన తప్పని అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.ఎవరైనా పైకి కనిపించే అందంను కాకుండా క్యారెక్టర్ ను ఇష్టపడతారని ఆ తర్వాత అర్థమైందని సాయిపల్లవి వెల్లడించారు.ప్రేమమ్ మూవీ తనలో ఎంతో ఆత్మవిశ్వాసంను నింపిందని సాయిపల్లవి కామెంట్లు చేశారు.

ఇటీవల లవ్ స్టోరీ మూవీతో సాయిపల్లవి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.విరాటపర్వం సినిమాతో సాయిపల్లవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు