యంగ్ హీరో రామ్ చాలా కాలం తర్వాత సక్సెస్ను సాధించాడు.ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ను రామ్ దక్కించుకున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత వరుసగా మాస్ చిత్రాలు చేయాలని రామ్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇస్మార్ట్ శంకర్ విడుదలకు ముందు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రంను చేసేందుకు రామ్ కమిట్ అయ్యాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఆ చిత్రం ప్రారంభం అవ్వాల్సి ఉంది.కాని హీరో రామ్ స్క్రిప్ట్లో మార్పులు, మాస్ ఎలిమెంట్స్ అంటూ ఆలస్యం చేయడం జరిగింది.
చివరకు ఆ సినిమానే క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రామ్ హీరోగా తెరకెక్కాల్సిన కిషోర్ తిరుమల మూవీ ప్రస్తుతానికి లేదు.
ఆ చిత్రం కంటే ముందు వినాయక్ దర్శకత్వంలో ఒక మాస్ మసాలా చిత్రంను రామ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.వినాయక్ కెరీర్ పరంగా కూడా ఈమద్య అస్సలు ఆయన పరిస్థితి బాగాలేదు.
అయినా కూడా ఆయనతో సినిమాను చేసేందుకు రామ్ ఆసక్తిగా ఉన్నాడు.వినాయక్ హీరోగా ఒక చిత్రం రూపొందబోతున్న విషయం తెల్సిందే.
నరసింహరాజు దర్శకత్వంలో వినాయక్ చేయలనుకుంటున్న మూవీ కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.వినాయక్ సన్నబడ్డ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.దాంతో అందుకు వినాయక్కు సమయం కావాల్సి ఉంది.
ఆసమయంలో రామ్తో సినిమా చేస్తూ సన్నబడేందుకు ప్రయత్నాలు చేయాలని వినాయక్ నిర్ణయించుకున్నాడు.మాస్ సినిమా కోసం రామ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరి ఆయన ప్రయత్నాలు సఫలం అయ్యేనో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy