విద్యుత్ షాక్ తో రైతు మృతి

నల్లగొండ జిల్లా:చండూరు మండలం( Chandur ) జోగిగూడెం గ్రామానికి చెందిన కలుగురు భిక్షమయ్య(65) అనే రైతు సోమవారం సాయంత్రం విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

వ్యవసాయం చేస్తూ జీవించే మృతుడు ఇటీవల రెండు రోజుల క్రితం ప్రాంత వ్యవసాయ బావులకు చెందిన ట్రాన్సర్మర్ ( Transformer )కాలిపోవడంతో మరమ్మతుల అనంతరం సోమవారం తోటి రైతులతో కలిసి అమర్చారు.

పక్కనే తన కూతురు జ్యోతికి చెందిన వ్యవసాయ బావి వద్ద మోటారు వైర్లు కార్బన్ రావడంతో సరిచేసి క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య ముగ్గురు కూతుళ్లు,ఓ కుమారుడు ఉన్నారు.

చామలేడు కార్యదర్శిపై ఎంపిడిఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

Latest Nalgonda News