వైరల్ వీడియో.. పట్టపగలే దోపిడీకి దిగిన భార్యాభర్తలు.. పోలీసుల ఎంట్రీతో..!

ఈ మధ్య కాలంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.రోజురోజుకూ దారుణాలు ఎక్కువ అవుతున్నాయి.

వ్యసనాలు బారిన పడి అడ్డదారులు తొక్కుతున్నారు.దొంగతనాలకు పాల్పడి అడ్డ దారుల్లో డబ్బు సంపాదిస్తూ విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు.

ఎంత పెద్ద స్కెచ్ వేసిన కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలు అవ్వడం ఖాయం.తాజాగా భార్యాభర్తలు ఇద్దరు పట్ట పగలే దొంగతనం చేయడానికి రెడీ అయి పోయారు.

అనుకున్నదే తడవుగా ఒక నగల షాప్ లోకి దూరి పోయారు.ఆ షాప్ లో ఉన్న వారిని బెదిరించి నగలు మాయం చేయడానికి పక్కా స్కెచ్ వేశారు.

Advertisement

కానీ చివరకు పోలీసులకు విషయం చేరడంతో ఊచలు లెక్క పెడుతున్నారు.వాళ్ళు దొంగతనం చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం లో చోటు చేసుకుంది.గుజరాత్ రాష్ట్రము లోని అహ్మదాబాద్ పట్టణంలో ఈ దొంగతనం ఘటన చోటు చేసుకుంది.

భార్య భర్తలు ఇద్దరు ఈ దోపిడీ చేయడానికి ముందుగానే స్కెచ్ వేసుకుని టైం కోసం ఎదురు చూస్తున్నారు.అదును చూసుకుని పట్ట పగలే దొంగతనం చేయడానికి రెడీ అయ్యి నగల షాప్ లోకి గన్స్ తో ఎంట్రీ ఇచ్చారు.ఆ షాప్ లో ఉన్న వాళ్ళను తమ వద్ద ఉన్న గన్స్ తో బెదిరించారు.

భర్త అక్కడ ఉన్న వారిని గన్స్ తో బెదిరిస్తుండగా భార్య ఆ షాప్ అద్దాలను సుత్తితో పగల గొట్టి నగలను తీసుకుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అన్ని నగలను బ్యాగ్ లో సర్దేసి వెళ్లి పోవాలి అనుకున్న టైమ్ లో అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర గన్స్ లాక్కుని వాళ్ళను బంధించారు.ఆ తర్వాత పోలీసులకు విషయం తెలుపడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు.ఇదంతా ఆ షాప్ లో ఉన్న సిసి టీవీ లో రికార్డ్ అవ్వడంతో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది.

Advertisement

అది కాస్తా వైరల్ అయ్యింది.ఆ వీడియోను మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

తాజా వార్తలు