కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వినతి పత్రం అందజేసిన బిజేపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులు,ప్రయాణికులు.

సింగిల్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బొయిని పల్లి నుండి వేములవాడకు రోడ్డు విస్తరణకు అనుమతులు , నిధులు మంజూరు చేయాలని, బోయినిపల్లి - బావుపేటకు సరైన రోడ్డు నిర్మాణంతో పాటుగా మండల పరిధిలో అన్ని గ్రామాలలో ఐమాక్స్ లైట్లు ,రోడ్లు ఇతర అభవృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని , ప్రజల పక్షాన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బిజేపి నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షలు గుడి రవీందర్ రెడ్డి,బిజేపి నియోజకవర్గ కో కన్వీనర్ ఉధారి నరసింహ చారి,మండల ప్రధాన కార్యదర్శి ఏడవెల్లి పర్శరాములు,దళిత మోర్చ మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు,కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు అమ్మిరిశెట్టి గంగయ్య , మండల ఉపాధ్యక్షులు బోగొజి గంగాధర్ చారి,పాలోజి రాజేంద్రప్రసాద్, మెరుపుల గంగాధర్,బిజేపి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి - మోత్కురావుపేట రోడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

Latest Rajanna Sircilla News