డి ఏవి స్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
వేధింపులకు కారణమైన బంజారాహిల్స్ లోని బిఎస్డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ అధికారి ని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
మునుగోడు ఓటర్ల లిస్టులో గందరగోళం నెలకొంది.బతికున్న వాళ్ళ ఓట్లు తొలగించడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ చుండూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ పర్యటనలు ఉన్నారు .కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ కు షర్మిల ఫిర్యాదు చేశారు.
దళిత బంధు కోసం నిర్మల్ జిల్లాలో దళితులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.అర్హులైన అందరికీ దళిత బంధు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలోని చుండూరులో మళ్లీ పోస్టర్ ల కలకలం రేగింది.లంబాడీల ఓట్లను కొనాలని బిజెపి దుష్ప్రచారం చేస్తోందని లంబాడీల బిడ్డలు అమ్ముడుపోయేవారు కాదంటూ గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై పాస్టర్లు అంటించారు.
తెలంగాణలోని గోషామహల్ స్టేడియంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ బిజెపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని టి ఎస్ ఆర్ టి సి ఎండి సజ్జనార్ సూచించారు.
దీపావళి పండుగ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తాను బలహీనపడ్డానని చూపించి తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు కొంతమంది తమ పార్టీకి చెందిన నాయకులు కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
నర్సీపట్నం విద్యార్థుల పోరాటం పై చంద్రబాబు ట్విట్ చేశారు.ప్రజా సమస్యల విషయంలో ఈగో వద్దు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు.
తెలంగాణలో శుక్రవారం నుంచి ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.దీనిలో భాగంగా అభ్యర్థులు 21 న స్లాట్లు బుక్ చేసుకోవాలి.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టనున్న పాదయాత్ర (భారత్ జోడో ) నేటితో ఏపీలో ముగియనుంది.నేడు కర్ణాటకలోకి ప్రవేశించనుంది.
ప్రధాని నరేంద్ర మోది నేడు కేదార్నాథ్ పర్యటనకు వెళ్లనున్నారు.
ఏపీ సీఎం జగన్ పెళ్లి కాదని పులి అని అది తెలియకపోతే ఆహారం అయిపోతావు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీ లో చేరిన తెలంగాణ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీ కి రాజీనామా చేశారు.
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసు ఇచ్చారు.
బీజేపీ కీలక నాయకుడు, మాజీ మండలి చైర్మన్ ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు.
కంటి అద్దాలు పెట్టుకోవడం మొన్నటి వరకు మామోషిగా ఫీల్ అయిపోయాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,250 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,450.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy