40 ఏండ్లకు కలుసుకున్నారు.. ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా : 40ఏండ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు అదే బడిలో కలుసుకొని వారి అనుబూతులను పంచుకున్నారు.

ఎల్లారెడ్డిపేట హైస్కూల్ లో 1982-,83 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

నాలుగు దశాబ్దాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.అనంతరం పాల్గొన్న వారికి మెమోంటోలను అందజేశారు.

ఈ సమ్మేళనంలో రాధాకృష్ణ , బండారి బాల్ రెడ్డి, శ్రీగాధ అశోక్ ,బందారపు బాల్ రెడ్డి, రామ్, సురేష్ , లక్ష్మారెడ్డి, గుండాడి రాం రెడ్డి,తీగల రాజేష్ గౌడ్ , ఇంద్రాసేనారెడ్డి , బచ్చు ఆంజనేయులు , రాపెల్లి దేవాంతం, దుమాల శంకర్ , దేవాదాస్ , దాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
విలేఖరులం అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు - ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

Latest Rajanna Sircilla News