ఆర్మీ జవాన్ కి ఘనంగా అంతిమ యాత్ర

సూర్యాపేట జిల్లా:కోదాడ చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెంకటేశ్వర్లు(38) మృతిచెందడంతో బంధువులు,మిత్రులు గ్రామ ప్రజలు శ్లోకసంద్రంలో మునిగిపోయారు.

వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని రాహుల్ కేల జిల్లా కేంద్రంలోని 19వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

ఆయన సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా తమ తోటి సిబ్బందితో కలిసి వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్ ఒకటి ఢీకొంది దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.మృత దేహాన్ని మంగళవారం రాహుల్ కేల గార్డు ఆఫ్ అనంతరం నుంచి రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి మృత దేహాన్ని తరలించారు.

బుధవారం వీర జవాన్ వెంకటేశ్వర్ల పార్థివ దేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్ప చెప్పగా ఈరోజు హైదరాబాదు నుండి స్వగ్రామనీకి తీసుకువచ్చిన ఆర్మీ సిబ్బంది మృతదేహాన్ని కోదాడ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి మృత దేహానికి బంధువులు గ్రామ ప్రజలు అందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News