వాగులో పడ్డ ఆటో-డ్రైవర్ కి గాయాలు

యాదాద్రి జిల్లా:ఆలేరు మండలం కొలనుపాక వద్ద పాకురుపట్టి రోడ్డుపై వెళుతున్న ఆటో ఒక్కసారిగా జారీ వాగులో పల్టీ కొట్టడంతో డ్రైవర్ కి గాయాలయ్యాయి.

శనివారం సాయంత్రం ఆలేరు నుండి కొలనుపాక వెళ్తుండగా ఘటన జరిగింది.

వర్షాలకు కొన్ని రోజుల నుండి ప్రవహిస్తున్న నీటితో రోడ్డుపైన పాకురు చేరడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఆలేరు ఎంపీపీ గంధమల అశోక్ మాట్లాడుతూ ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని,ఇప్పటికైనా ఈ వాగును అభివృద్ధి చేయాలని,లేకపోతే గ్రామస్తులతో కలిసి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు ఏరియాలో చిరుత .. పట్టుకునేందుకు అధికారుల తంటాలు
Advertisement

Latest Latest News - Telugu News