గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.కేవలం 10 రోజుల మాత్రమే సమయం ఉంది.

 Pawan Kalyan Serious Comments On Cm Jagan In Giddalur Sabha Details, Ap Election-TeluguStop.com

దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచడం జరిగింది.రోజుకి కనీసం రెండు నుంచి మూడు బహిరంగ సభలలో పాల్గొంటూ.ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.2024 ఎన్నికలలో టీడీపీ.బీజేపీ.జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.గతంలో ఇవే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2014లో విజయం సాధించటం జరిగింది.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జాగ్రత్తపడుతున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై( YCP Govt ) పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో.పవన్ కళ్యాణ్ ప్రచారంలో స్పీడ్ పెంచడం జరిగింది.దీనిలో భాగంగా శుక్రవారం గిద్దలూరులో( Giddalur ) నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్( CM Jagan ) పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారని ఆరోపించారు.గిద్దలూరు సభలో మాట్లాడుతూ.‘మా పార్టీకి ఈ సెగ్మెంట్లో బలం ఉన్నా రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీకి సీటు త్యాగం చేశా.ఈ ఎన్నికల్లో సీఎం జగన్ కూ వెన్నులో భయం తెప్పించాలి.

ఆయన విధేయతతో కాకుండా రౌడీయిజంతో ఓట్లు అడుగుతున్నారు.జగన్ ను ఇంటికి పంపించాలి’ అని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube