పాలిటెక్నిక్ లో విజ్ఞాన్ విద్యార్థికి రాష్ట్ర 191వ ర్యాంకు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిన విద్యార్థి చింత రిశ్వంత్ సోమవారం వెలువడిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాలలో 191 ర్యాంకు సాధించగా మంగళవారం రిశ్వంత్ ను కరస్పాండెంట్ లతీఫ్ సన్మానించారు.

విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ రిశ్వంత్ తమ పాఠశాలలో పదవ తరగతి చదివి 10 జీపీఎస్ సాధించడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ లో 120 మార్కుల గాను 112 మార్కులు సాధించడం జరిగిందన్నారు.రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో 191వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు.

కరస్పాండెంట్ లతీఫ్ రిశ్వంత్ ను శాలువాతో సత్కరించి, విద్యార్థి తండ్రి చింత రాజును అభినందించారు.అదేవిధంగా ప్రిన్సిపల్ శరత్ కుమార్, ఉపాధ్యాయ బృందం రిశ్వంత్ ను అభినందించారు.

విలేఖరులం అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు - ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News