టీఆర్ఎస్‎పై వైఎస్ షర్మిల మండిపాటు

టీఆర్ఎస్‎పై వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను చింపివేశారని, తమ పార్టీ నేతలపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.చామనపల్లిలో దాడులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడమని తెలిపారు.ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్‎టీపీ జోలికి వస్తే ప్రజలు సహించరని షర్మిల హెచ్చరించారు.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు