ఆనంద నిలయం అంటే ఏమిటి.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?

కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవారిని వివిధ నామాలతో భక్తులు పిలుస్తూ ఉంటారు.

అందులో భక్తులు ఎక్కువగా స్పందించిన నామాలలో ఆనంద నిలయ గోవిందా నామం కూడా ఒకటి.

అసలు ఆనంద నిలయం అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.కలియుగంలో భక్తుల రక్షణార్థం ఇలవైకుంఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వెలసినాడు శ్రీహరి.

అచెంచలమైన భక్తి భావంతో భక్తులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకొని ఆనంద నిలయంలో కొలువై శ్రీవారిని దర్శించుకుంటారు.కలియుగవైకుంఠంలో వెలసిన శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తుల తరలి వచ్చి ఆపదమొక్కులవాడ గోవిందా.

ఆనంద నిలయ గోవిందా.గోవిందా అంటూ స్వామివారిని స్మరిస్తూ ఉంటారు.

Advertisement
What Is Ananda Nilayam What Makes It Special, Ananda Nilayam, Sri Venkateswara S

ఎన్ని నామాలతో పిలిచిన పలుకుతూ భక్తుల కష్టాలు, కోరికలను శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి తీర్చుతాడని భక్తులు నమ్ముతారు.

What Is Ananda Nilayam What Makes It Special, Ananda Nilayam, Sri Venkateswara S

స్వయం వ్యక్తమై వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పతరువు స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలగి ముక్తి మార్గం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అందుకే శ్రీవారి ఆనంద నిలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా ఉంటుంది.శ్రీ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా కొలువైన దివ్య సన్నిధే ఆనంద నిలయం.

ఆ ఆనంద నిలయానికి భౌతిక రూపమే భౌతిక స్వరూప విమానం.అందువల్ల తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గర్భ గుడి మీద గల సువర్ణమయ నిర్మాణాన్ని ఆనంద నిలయ విమానం అంటారు.

విష్ణుదేవుని( Lord Vishnu ) ఆన మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసుకుని వచ్చినట్లు, దానిని సువర్ణముఖి నదికి ఉత్తరం వైపున శేషాచల కొండల్లో ప్రతిష్టించినట్లు ఆ క్రీడాద్రి మీద భూవరాహ స్వామి శ్వేతవరాహకల్పం నుంచి నివసించినట్లు అనేక పురాణాలలో ఉంది.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు