కరోనా లాక్ డౌన్ టైం లో బాగా పాపులర్ అయిన ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతూ తమ ఎంప్లాయీస్ కు పెద్ద షాక్ ఇచ్చింది.
లాస్ట్ ఇయర్ యూనికార్న్ హోదా కూడా దక్కించుకున్న ఈ కంపెనీ తమ కంపెనీ నుండి 200 మంది ఉద్యోగులను తీసేసింది.
వారిలో 120 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా మిగతా 80 మంది పర్మినెంట్ ఉద్యోగులు.సంస్థ వృధి ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపు ప్రక్రియ జరిగినట్టు వేదాంతాతు సంస్థ ప్రకటించింది.2011 లో మొదలైన ఎడ్యుటెక్ స్టార్టప్ వేదాంతూ 2021లో జరిగిన ఈ రౌండ్ ఫండ్ రైజింగ్ లో భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న్ హోదా పొందింది.అయితే కంపెనీ ఆశించిన వృద్ధి లేకపోవడంతోపాటుగా ఫ్యూచర్ అవసరాల దృష్టిలో పెట్టుకుని వారి ప్లాన్స్ మార్చుకున్నారని తెలుస్తుంది.
అందుకే 200 మంది ఉద్యోగులను తీసివేసినట్టుగా చెబుతున్నారు.దేశవ్యాప్తంగా వేదాంతూలో 6000 ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇదేకాదు ఇంతకుముందు మరో యూనికార్న్ ఎడ్యుటెక్ సంస్థ అన్ అకాడమీ కూడా తమ కంపెనీ నుండి 600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఆన్ లైన్ ట్యూషన్ వల్ల చాలామంది ఇంటి దగ్గర నుండే వారి అవసరాలకు అనుగుణంగా కావాల్సిన కోర్స్ లను తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy