సింగర్‌గా మారిన నివేథా థామస్.. వైరల్ వీడియో?

టాలీవుడ్ ముద్దుగుమ్మ నివేథా థామస్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేథా.

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం లో కూడా నటించింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మకు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

బాలనటిగా కోలీవుడ్ లో అడుగు పెట్టిన నివేథా థామస్ 2016లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక కొన్ని సినిమాలు అంత సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి.

Advertisement

అలా టాలీవుడ్ లో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక ఈ ఏడాది విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా తాజాగా ఓ వీడియో షేర్ చేసుకుంది.

అందులో ఓ హిందీ పాట పాడుతూ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

చేతిలో గిటార్ పట్టుకుని వాయిస్తూ జానే తు యా జానేనా అనే సినిమాలో కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడింది.ఇక ఈ పాట ఎంతో అద్భుతంగా పడగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ పాటను విన్న నెటిజన్లు బాగా పాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శాకిని డాకిని అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటిస్తుంది.

Advertisement

ఇక మరో కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ లో నటించనుండగా ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది.ఇక ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు