ఏపీ సీఎం జగన్పై తెలుగు దేశం అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో మాట్లాడుతూ సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు చేశాడు.
జగన్ ఇప్పటికే పలు గుణపాఠాలు ఎదురయ్యాయి.ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టం జరిగింది.
అయినా కూడా వాటి నుండి కాస్త అయినా నేర్చుకోకుండా మొండిగా ముందుకు వెళ్తున్నాడు అంటూ ఎద్దేవ చేశాడు.
ఇక మా వ్యాపారాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
మేము గతంలో ఈ పని చేసి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది అంటూ జగన్ను ప్రశ్నించాడు.కొత్త పాఠాలు నేర్పుతున్నాడు అంటూ జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నాడు.
వ్యాపార మూలాలాను దెబ్బ తీసేందుకు జగన్ చేస్తున్న పని గతంలో మేము చేసి ఉంటే మీ వ్యాపారాలు అన్ని కూడా నాశనం అయ్యేవి అని, మీరు మీ వ్యాపారాలు చాలా నష్టపోయేవి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలాంటి పనులు ఎంత మాత్రం కరెక్ట్ కాదని, అసలు ఇలాంటి చర్యలు మానుకోవడం మంచిది అంటూ సూచించాడు.