స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.
ఈ సినిమాతో బన్నీతో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సుకుమార్ పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగుతున్నాడు.ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సుకుమార్, ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం సుకుమార్ రెమ్యునరేషన్ కూడా కళ్లుచెదిరే స్థాయిలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.పుష్ప చిత్రం కోసం సుకుమార్ ఏకంగా రూ.23 కోట్ల భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో బన్నీ అల్ట్రా మాస్ లుక్లో ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, స్టిల్స్ చెబుతున్నాయి.కాగా ఈ సినిమాలో ఆయన ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.
ఇక పుష్ప చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం అడవి నేపథ్యంలో సాగుతుండటంతో ఆలస్యం అవుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరి పుష్ప చిత్రం ఎప్పుడు షూటింగ్ ముగించుకుంటుందా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.