పుష్ప కోసం తన ఆస్థాన కెమెరామెన్ ని పక్కన పెట్టిన సుకుమార్

టాలీవుడ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్.

సుకుమార్ కెరియర్ లో హిట్స్, ఫ్లాప్స్ సంగతి ఎలా ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో అందరి కంటే అడ్వాన్స్ గా ఆలోచించి సినిమాలు తీస్తాడని మాత్రం పేరుంది.

ఈ నేపధ్యంలో స్టార్ హీరోలు అతనితో కలిసి పని చేయడానికి ఇష్టపడతారు.ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించబోతున్నారు.

ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత సెట్స్ పైకి వెళ్తుంది.ఇందులో అల్లు అర్జున్ మొదటి సారి పక్కా మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుకుమార్ మొదటి సారి తన ఆస్థాన కెమెరామెన్ ని పక్కన పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాంటే కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు ఉండాల్సిందే.

Advertisement

ఇప్పటి వరకు వరకు సుకుమార్ చేసిన అన్ని సినిమాలకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.ఇక కెమెరామెన్ గా రత్నవేలు పని చేస్తూ వస్తున్నాడు.

ఇక సుకుమార్ నిర్మాతగా ఉన్న సినిమాలకి కూడా ఎక్కువగా రత్నవేలు కెమెరామెన్ గా ఉంటాడు.అయితే మొదటి సారి పుష్ప సినిమా కోసం రత్నవేలుని సుకుమార్ పక్కన పెట్టాడు.

ఈ సినిమాకు ఫారిన్ కెమెరామెన్ బ్రోజెక్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు.బ్రోజెక్ ఇంతకుముందు నాని నటించిన గ్యాంగ్ లీడర్ కు సినిమాటోగ్రఫీ అందించాడు.

ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకి చేసిన అనుభవం ఉన్న బ్రోజెక్ అయితే పాన్ ఇండియా మూవీగా ఆవిష్కరిస్తున్న పుష్ప సినిమాని విజువల్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో చూపించగలడని సుకుమార్ భావించినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో రత్నవేలుని పక్కన పెట్టాడని చెప్పుకుంటున్నారు.

ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?
Advertisement

తాజా వార్తలు